హుజూర్నగర్లో వార్ వన్సైడ్.. 17వేల 400 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

By - TV5 Telugu |24 Oct 2019 10:10 AM IST
హుజూర్నగర్లో వార్ వన్సైడ్ అని తేలిపోయింది. తొలి రౌండ్ నుంచే TRS అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలిరౌండ్లో 2467 ఓట్ల ఆధిక్యం వస్తే.. 8వ రౌండ్ వరకూ ఆ జోరు కొనసాగింది. ఇప్పటికి17వేల 400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హుజూర్నగర్లో ఈసారి టీఆర్ఎస్ జెండా ఎగరేయడం ఖాయం కావడంతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఉత్తమ్కుమార్రెడ్డి MPగా గెలవడంతో ఆయన MLA పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి పోటీ చేస్తే.. TRS నుంచి సైదిరెడ్డి బరిలోకి దిగారు. గతంలో పలుమార్లు ఓటమి పాలైనా సింపతీతోపాటు, KCR మార్క్ మ్యాజిక్ పనిచేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com