స్కూల్లో కరెంట్ షాక్ తగిలి ఐదో తరగతి విద్యార్థి మృతి
By - TV5 Telugu |25 Oct 2019 1:53 PM GMT
నిజామాబాద్ కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ షాక్తో ఐదో తరగతి బాలుడు చనిపోవడం కలకలం రేపుతోంది. శిథిలావస్థకు చేరిన ఈ పాఠశాలలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఐదో తరగతి విద్యార్థి హయాన్ ఖాన్కు అవి తగలడంతో కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. బాలుడి మృతిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి వివరణ ఇచ్చే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదంటూ ఆందోళనకు దిగారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com