ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. నవంబర్ 1 నుంచి..


ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత విధించింది. 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. లక్షరూపాయల వరకు డిపాజిట్లు ఉన్న అకౌంట్లకే ఇది వర్తిస్తుంది. దీంతో 1వ తేదీ నుంచి బ్యాంక్ కస్టమర్లకు 3.5 శాతం వడ్డీ రేటు కాకుండా 3.25 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది. దీంతో బ్యాంకులో డిపాజిట్ చేసిన వారికి తక్కువ రాబడి రానుంది. ఎస్బీఐ ఇదివరకే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రెపో రేటు తగ్గించడం ఇందుకు కారణం. రెపో రేటు ఇప్పుడు 5.15 శాతంగా ఉంది. ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 0.10 శాతం తగ్గుదలతో 6.4 శాతానికి దిగొచ్చాయి. ఏడాది నుంచి 2 ఏళ్ల కాలపరిమితిలోని డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. స్టేట్ బ్యాంక్ రూ.2 కోట్లకు పైన ఉన్న డిపాజిట్ అకౌంట్లపై కూడా రేట్లను తగ్గించింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో 0.30 శాతం కోత విధించింది. దీంతో ఈ డిపాజిట్లపై 6.3 శాతం కాకుండా 6 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోంది. ఒక్క ఎస్బీఐ మాత్రమే కాదు ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

