కన్న తల్లిని అతి దారుణంగా కొట్టి చంపిన కుమారుడు
By - TV5 Telugu |3 Nov 2019 10:42 AM GMT
కుటుంబ కలహాల కారణంగా... తల్లిని అతి దారుణంగా కొట్టి చంపాడో కుమారుడు. కామారెడ్డిజిల్లా చిట్యాలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. సాయవ్వకు అక్రమ సంబంధాలున్నాయని... కొడుకు మహేష్ అనుమానం. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలోనే గతంలో మహేష్ ను చంపించాలని చూసింది సాయవ్వ. ఈ కేసులోనే సాయవ్వతో పాటు మరో నలుగురు జైలుకు వెళ్లి ఇటీవలే విడుదల అయ్యారు.
జైలు నుంచి బయటకు వచ్చిన సాయవ్వ మళ్లీ తనను చంపిస్తుందని భావించాడు కొడుకు మహేష్. ఈ భయంతోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో కర్రతో దారుణంగా కొట్టిచంపి పరారయ్యాడు. ఈ ఘటనతో చిట్యాల గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com