నేను తలుచుకుంటే వాళ్ల కంటే ఎక్కువ విమర్శలు చేస్తా - పవన్

X
By - TV5 Telugu |5 Nov 2019 9:00 PM IST
వైసీపీ నేతలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాను కూడా వైసీపీ నేతల కంటే ఎక్కువే వ్యక్తిగత విమర్శలు చేయగలనని.. కానీ అది సమస్యకు పరిష్కారం కాదన్నారు. ప్రతి ప్రభుత్వ పథకానికి ముందు పార్టీ పేరు చేర్చడాన్ని తప్పుపట్టారు. విశాఖలో నిర్వహించిన జనసైనికుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు పవన్. సమాజం పట్ల ప్రేమ ఉండబట్టే.. అన్నింటినీ వదిలి పార్టీ ఏర్పాటు చేశానని చెప్పారు. ప్రజలు జనసేనకు ఓటు వేయకపోయినా.. వారి సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటానన్నారు పవన్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com