ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరం - ఆజాద్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్. పేదప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు, రైతులకు మద్దతు ధర అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 10 శాతంగా ఉంటే బీజేపీ పాలనలో అది 5 శాతానికి పడిపోయిందన్నారు. పెట్రోల్, డీజిల్ పై పన్నుల పేరుతో ప్రజలపై కోట్లభారం మోపారని ఆరోపించారు ఆజాద్. విపరీతంగా పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య దేశానికి పెను సవాల్గా మారిందన్నారు.
హైదరాబాద్కు వచ్చిన ఆజాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం భాదాకరమన్నారు ఆజాద్. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అటు తహసీల్దార్ విజయారెడ్డి హత్య హేయమైన చర్య అన్న ఆజాద్.. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com