రెవెన్యూ ఆఫీస్లో సామూహిక ఆత్మహత్యాయత్నం..

X
By - TV5 Telugu |6 Nov 2019 5:49 PM IST
రెవెన్యూ యంత్రాంగం చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయిన ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం చేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన బాబు అనే రైతు కుటుంబం.. తహసీల్దార్ కార్యాలయంలోనే ఉరేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే అక్కడున్నవారు వారిని అడ్డుకున్నారు.
రామకుప్పం మండలంలో బాబు సహా ఏడు కుటుంబాలకు చెందిన 7 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి పట్టాలను వేరొకరికి ఇచ్చారు. ఆ స్థలం తమదేనంటూ బాబు 6 నెలలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా స్పందన లేకపోవడంతో తన కుటుంబంతో సహా వచ్చి తహశీల్దార్ ఆఫీసులో ఉరి వేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎమ్మార్వో ఆఫీసు గేట్లకు ఉరితాళ్లు బిగించి.. తమ భూమి తమకు ఇవ్వకపోతే ఇక్కడే చనిపోతామని హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com