విశాఖలో చిక్కిన బంగ్లాదేశ్ క్రిమినల్స్

X
By - TV5 Telugu |13 Nov 2019 12:10 PM IST
కేరళలో రెండు హత్యలు చేసి.. తప్పించుకుంటున్న ఇద్దరు నిందితులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. లబులు, జ్యువెల్ అనే బంగ్లాదేశీయులైన క్రిమినల్స్.. కేరళలోని వెన్మని పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిని హత్యచేసి వారి నుంచి బారీగా బంగారం, నగదు దోచుకున్నారు. విశాఖ మీదుగా కోల్ కతా వెళ్లి.. అక్కడి నుంచి తమ దేశానికి పారిపోవాలని ప్రయత్నించారు. కేరళ పోలీసులు ఇచ్చిన సమాచారంతో విశాఖ పోలీసులు నిఘా పెట్టి.. హంతకులను రైల్వేస్టేషన్ లో అరెస్టు చేశారు. వారి నుంచి బంగారం కూడా రికవరీ చేసినట్టు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com