ఆంధ్రా ఊటీ అందాలు చూడతరమా..

X
By - TV5 Telugu |14 Nov 2019 10:54 AM IST

విశాఖ మన్యంలో చలి ప్రజలను వణికిస్తోంది. మంచు దట్టంగా కమ్మేసింది. శీతాకాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చింతపల్లిలో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరో వైపు మంచు అందాలను ఆస్వాదించేందుకు లంబసింగి, అరకు ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

