పసిడి ధర పడిపోయిందనుకుంటే మళ్లీ ఈ రోజు..
By - TV5 Telugu |14 Nov 2019 7:21 AM GMT
నాలుగు రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి ధర ఈ రోజు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం పది గ్రాములున్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరిగి రూ.39,640కు చేరుకుంది. 22 క్యారెట్ల ధర రూ.120 పెరిగి రూ.36,340కు చేరుకుంది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడుస్తోంది. కేజీకి రూ.20 పెరిగి ప్రస్తుతం కేజీ వెండి దర రూ.48,770కు చేరుకుంది. డిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.38,300 కు చేరుకుంది. అదే సమయంలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.37,100కు చేరింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com