అప్పుడే దీక్షలు, ఉద్యమాలు చేయడమేంటి : చంద్రబాబుపై వంశీ విమర్శ

X
By - TV5 Telugu |14 Nov 2019 6:12 PM IST
ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి తగదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే అంశంలో తాను ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. డబ్బులున్న వారి పిల్లలందరూ ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతుంటే... పేదలు మాత్రమే తెలుగు మీడియంలో ఎందుకు చదవాలని ప్రశ్నించారు. తెలుగుభాష పరిరక్షణ బాధ్యత పెద్ద వారికి లేదా అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి పురిటి వాసన కూడా పోలేదని.. అప్పుడే దీక్షలు, ఉద్యమాలు చేయడమేంటని.. వంశీ విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com