వంశీ పదవికి రాజీనామ చేసి పార్టీ మారాలి: స్పీకర్ తమ్మినేని

వంశీ పదవికి రాజీనామ చేసి పార్టీ మారాలి: స్పీకర్ తమ్మినేని

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సభ్యుడైనా పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవన్నారు. సభా నాయకుడిగా సీఎం కూడా ఇదే చెప్పారని.. దానికే తాను కట్టుబడి ఉన్నానన్నారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.

Tags

Read MoreRead Less
Next Story