ప్రపంచ స్థాయి ప్లీనరీకి వేదికైన హైదరాబాద్

ప్రపంచ స్థాయి ప్లీనరీకి వేదికైన హైదరాబాద్

cha

అంతర్జాతీయ బ్లాక్ చైన్ ఫోరం TC 307 ప్రపంచ స్థాయి ప్లీనరీకి హైదరాబాద్ వేదికైంది. ఈ ఆరవ ప్లీనరీకి 56 దేశాల నుంచి సుమారు 150 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ పరిధిని వివిధ రంగాలకు విస్తరించడంతో పాటు గ్లోబల్ స్టాండర్డ్స్‌పై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్లీనరీలో బ్లాక్ చైన్ సెక్యూరిటీ, ప్రైవసీ, ఐడెంటిటీ, స్మార్ట్ కాంట్రాక్ట్స్ వంటి వివిధ అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. ఆ తర్వాత వాటిపై వివిధ దేశాల ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొంటారు. దీని వల్ల ఈ టెక్నాలజీకి క్రమబద్ధత తీసుకువచ్చేందుకు ఆస్కారం ఉంటుందని ఈ కాన్ఫరెన్స్ ఇండియా చైర్, తమిళనాడు ఐటీ అడ్వైజర్ జేఎ చౌదరి వెల్లడించారు.

Tags

Next Story