కత్తి పట్టుకొని పోలీసులను వెంటాడి.. చివరికి..

X
By - TV5 Telugu |19 Nov 2019 12:30 PM IST

విశాఖలో పోలీసులకే వణుకు పుట్టించే ఘటన జరిగింది. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సురేష్, హోం గార్డ్ కుమార్లు ప్రాణభయంతో పరుగు పెట్టాల్సి వచ్చింది. గుర్రం సాయి అనే వ్యక్తి కత్తిపట్టుకుని పోలీసులను వెంటాడాడు.
ఉడా చిల్డ్రన్ థియేటర్ మెయిన్ గేట్ వద్ద సాయి తన గుర్రపు బండి పెట్టాడు. గేటుకు అడ్డంగా ఉందని సెక్యూరిటీ చెప్పడంతో గొడవ మొదలైంది.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న గుర్రం సాయి.. అక్కడికి వచ్చిన పోలీసులతో ఘర్షణ పడ్డాడు. చేతిలో కత్తిపట్టుకుని పోలీసుల వెంటపడ్డాడు. ఆ తర్వాత ఎట్టకేలకు పోలీసులు అతడిని పట్టుకుని కేసు నమోదు చేసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

