కర్నూలు : ఉల్లి రైతుల పంట పండుతోంది

X
By - TV5 Telugu |20 Nov 2019 12:18 PM IST

కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పంట పండుతోంది. ప్రస్తుతం 100 కేజీల ఉల్లి ఏకంగా రూ. 6,700 పలుకుతోంది. భారీగా పెరిగిన రేటుతో ఉల్లి రైతులైతే ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ నెలాఖరుకల్లా రేటు 10 వేలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. రైతుకే ప్రస్తుతం క్వింటాకు 6వేల 700 అందుతుంటే.. అది వినియోగదారుల దగ్గరకు వచ్చేసరికి కేజీ రూ.80 నుంచి రూ.90 మధ్యలో ఉంటోంది. పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడం కర్నూలు రైతులకు కలిసొచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

