శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే

X
By - TV5 Telugu |24 Nov 2019 11:46 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఎస్ఏ బోబ్డేకు ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆయను వేద పడింతులు ఆశీర్వదించగా... ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

