ప్రియాంకను హత్య చేసింది ఆ నలుగురే : సీపీ సజ్జనార్‌

ప్రియాంకను హత్య చేసింది ఆ నలుగురే : సీపీ సజ్జనార్‌
X

cp-sajjanar

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు పోలీసులు. ప్రియాంకారెడ్డిని పక్కా పథకం ప్రకారమే ట్రాప్‌ చేసి అత్యాచారం జరిపి, దారుణంగా హత్య చేశారని సైబారబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. డాక్టర్‌ ప్రియాంక రెడ్డి స్కూటీని టోల్‌ప్లాజా పక్కన పార్క్‌ చేయడం నలుగురు నిందితులు చేశారని, సాయంత్రం బైక్‌ తీసుకుపోవడానికి వస్తుందని ఆమె కోసం మాటు వేశారని, ఎలానైనా అత్యాచారం చేయాలని పథకం రచించరని సీపీ వివరించారు.

ప్రియాంక ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలని నవీన్‌ అనే వ్యక్తి బైక్‌ పంక్చర్‌ చేశాడన్నారు. ప్రియాంక బైక్‌ కోసం తిరిగి వచ్చేలోపు అప్పటికే నలుగురూ మద్యం సేవించి ఉన్నారని. స్కూటీ పంక్చర్‌ కావడంతో ఆమె ఒంటరిగా ఉండిపోయిందని. ఈ నేపథ్యంలోనే తొలుత ఆమె దగ్గరకు ఆరీఫ్‌ వచ్చి బైక్‌ తీసుకున్నాడని. పంక్చర్‌ చేయిస్తా అని బైక్‌ను తీసుకుని శివను పంపించాడన్నారు. అదే సమయంలో ప్రియాంక ఆమె సోదరికి ఫోన్‌ చేసి మాట్లాడిందని చెప్పారు..

రాత్రి 9:30 గంటల సమయంలో శివ కేవలం గాలి మాత్రమే కొట్టించాడని. ఈ లోపు ఆరీఫ్‌, నవీన్‌, కేశవులు కలిసి ప్రియాంకను టోల్‌ప్లాజా పక్కనే ఉన్న.. నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా లాక్కుని వెళ్లారని. ఆరీఫ్‌ ముక్కు, నోరు గట్టిగా నొక్కిపట్టి ఆరవకుండా చేశారన్నారు. ఈలోపు శివ కూడా వచ్చి ఆమెపై అత్యాచారం జరిపి, అంతా కలిసి హత్య చేశారని వెల్లడించారు. బుధవారం రాత్రి 10: 08 గంటలకు ఆమె చనిపోయిందని నిర్ధించారు. తరువాత ప్రియాంక శవాన్ని 10:30కి లారీలో తీసుకుని వెళ్లి.. మధ్యలో ఓ పెట్రోల్‌ బంక్‌ దగ్గర ఆగి బాటిల్‌లో పెట్రోల్‌ తీసుకుని తెల్లవారుజూమున 2:30 గంటలకు చటాన్‌పల్లి పెట్రోల్‌ పోసి దహనం చేశారని వివరించారు..

26 ఏల్ల నిందితుడు మహ్మద్‌ ఆరీఫ్‌ను ఏ1 గా, 20 ఏళ్లు వయసు ఉన్న ముగ్గురు నిందితులను శివను ఏ2గా, నవీన్‌ ఏ3గా, కేశవులు ఏ4గా కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు సీపీ వెల్లడించారు.

Tags

Next Story