కేసీఆర్ సర్కార్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్

X
By - TV5 Telugu |1 Dec 2019 4:40 PM IST
తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంపై విసిగిపోయారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రత్యామ్నాయం కోసం బీజేపీవైపు చూస్తున్నారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయం భూమి పూజలో పాల్గన్న లక్ష్మణ్ .. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై సీఎం మాట్లాడకపోవడం.. మంత్రులు మాట్లాడినా.. ఏం చెబుతున్నారో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నారని లక్ష్మణ్ విమర్శించారు. తల్లిదండ్రులు కేసులు పెట్టడానికి వెళితే పోలీసుల తీరు కూడా సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com