ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర కొనసాగుతున్న ఉద్రిక్తత
By - TV5 Telugu |1 Dec 2019 11:16 AM GMT
మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో స్థానికులు, ప్రజలు, వివిధ సంఘాలు చేరుకున్నారు. అటు ప్రియాంక తల్లిదండ్రులు తమ ఇంటికి ఎవరూ రావొద్దు అంటూ గేటుకు తాళం కూడా వేశారు. అయినా అంతా బయటే బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీ రేవంత్ రెడ్డి.. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు.
లోపలకు వెళ్లకుండా తనను అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు రేవంత్ రెడ్డి. కాసేపు వాగ్వాదం తరువాత రేవంత్ రెడ్డిని మాత్రమే ఇంటిలోపలకు పంపారు పోలీసులు. ఈ సందర్భంగా మీడియాను సైతం లాఠీలతో వెనక్కు నెట్టారు పోలీసులు. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com