ఏపీలో బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష
By - TV5 Telugu |2 Dec 2019 3:45 PM GMT
విజయవాడ పోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. 2017 డిసెంబర్లో అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకునేందుకు ఉయ్యూరు నుంచి తల్లితో కలసి బాధిత బాలిక ఇబ్రహీంపట్నానికి వచ్చింది. అయితే బాలిక బంధువైన సైకం కృష్ణారావు ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో బాలిక తల్లి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదుపై కేసునమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు.. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడు కృష్ణారావుకు 20 సంవత్సరాల కఠినకారాగా శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com