మృతదేహాలకు పూర్తయిన పంచనామా..
![మృతదేహాలకు పూర్తయిన పంచనామా.. మృతదేహాలకు పూర్తయిన పంచనామా..](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2019/12/encounter.png)
లదిశ కేసులో ఎన్కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు...అక్కడ పోస్ట్మార్టమ్ పూర్తైన తర్వాత డెడ్బాడీస్ను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అంతకుముందు..ఘటనాస్థలంలోనే పంచనామా నిర్వహించారు. క్లూస్టీమ్, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పంచనామా చేశారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి ఆ నలుగురు నిందితుల కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చారు. మృతదేహాలను వారికి చూపించారు.
నలుగురు నిందితులకు నలుగురు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు పంచనామా చేశారు. A-1 మహ్మద్ అరిఫ్ మృతదేహానికి ఫరూక్నగర్ తహసీల్దార్, A2- చెన్నకేశవులు డెడ్బాడీకి కొందుర్గ్ తహసీల్దార్, A3-శివ మృతదేహానికి నందిగామ తహసీల్దార్, A-4 నవీన్ డెడ్బాడీకి చౌదరిగూడ తహసీల్దార్ పంచనామా చేశారు. అటు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో క్లూస్ టీమ్ గన్స్ సీజ్ చేసింది...12 బుల్లెట్లను కూడా రికవరీ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com