H1b వీసా దరఖాస్తు విధానాన్ని మార్చిన అమెరికా

అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేసుకునే వీలు కల్పించే H1b వీసా దరఖాస్తు విధానాన్ని మార్చింది ప్రభుత్వం. 2021 ఏడాదికి H1b వీసా దరఖాస్తులను ఇకపై ఎలక్ట్రానిక్ పద్దతిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. దీనిలో భాగంగా వివిధ కంపెనీలు తాము తీసుకుంటున్న ఉద్యోగుల పూర్తి వివరాలను సమర్పించాలని కోరింది. రిజిస్ట్రేషన్ కోసం 10 డాలర్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం ప్రతియేటా 85 వేల H1b వీసాలను లాటరీ పద్ధతిలో ఇస్తోంది. 2020- 21 సంవత్సరానికి గాను వచ్చే ఏడాది మార్చి 1నుంచి 20వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్, ఏప్రిల్ 1నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. అయితే ఎలక్ట్రానిక్ ప్రక్రియ వల్ల పేపర్ వర్క్ తగ్గుతుందని, ఐటి కంపెనీలకు, ఉద్యోగులకు సమాచారం ఇవ్వడం కూడా సులభమవుతుందని ఇమిగ్రేషన్అధికారులు తెలిపారు.
RELATED STORIES
Odisha: మొబైల్ ఫోన్ దొంగిలించాడని లారీకి కట్టి, చెప్పుల దండ వేసి..
25 May 2022 9:30 AM GMTViral Video: ఆకతాయి అల్లరి.. సింహం నోట్లో వేలు పెట్టాడు.. ఆ తర్వాత..
23 May 2022 12:45 PM GMT'Deer Zindagi': జీబ్రా క్రాసింగ్ వద్ద జింక.. జీవితం చాలా విలువైంది:...
20 May 2022 10:00 AM GMTBhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!
20 May 2022 5:30 AM GMTOdisha : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు
19 May 2022 3:15 PM GMTBengaluru: స్కూల్ విద్యార్థినుల ఘర్షణ.. బాయ్ఫ్రెండ్ కోసమే అంటూ...
18 May 2022 11:15 AM GMT