నారా లోకేష్కు తృటిలో తప్పిన ప్రమాదం

X
By - TV5 Telugu |11 Dec 2019 10:16 AM IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్ ముందు పడిపోయింది. లోకేష్ బస్సు దిగి అసెంబ్లీకి ఇతర ఎమ్మెల్సీలతో కలిసి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆపరేటింగ్ లోపం కారణంగానే డ్రోన్ కిందపడినట్లు తెలుస్తోంది.
అంతకుముందు ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళగిరిలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సు నుంచి లోకేష్ కిందకు దిగి.. అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో డ్రోన్ ఆయన ముందు పడిపోయింది. వెంటనే అంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఒక్క అడుగు ముందుకు పడినా ఆ డ్రోన్ ఆయన మీద పడేది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com