IRS అధికారి జాస్తి కృష్ణకిషోర్కు ఊరట

IRS అధికారి జాస్తి కృష్ణకిషోర్కు ఊరట లభించింది. ఆయన సస్పెన్షన్పై క్యాట్ స్టే విధించింది. 4 రోజుల క్రితం కృష్ణకిషోర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్ను ఆశ్రయించారు. ఈడీబీ శాఖలో ఉద్దేశపూర్వక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ.. నివేదిక వచ్చిందన్న కారణంతో… ఏపీ సర్కార్ కృష్ణ కిషోర్పై సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై ఆయన క్యాట్లో పిటిషన్ వేశారు. ఆ వెంటనే ఆయనపై కేసు నమోదు చేసింది ప్రభుత్వం. రాత్రి పూట సీఐడీ కేసు నమోదు చేయడంపై అధికారుల కూడా విస్మయం వ్యక్తం చేశారు.
జీవో నెంబర్ 124కు విరుద్ధంగా అడ్వటైజ్ మెంట్లను సంబంధిత శాఖ నుంచి కాకుండా నేరుగా ఇవ్వటమే ప్రధానమైన ఉల్లంఘనగా ప్రభుత్వం చెబుతోంది. ఈ మాత్రం దానికే.. కేంద్ర సర్వీసు అధికారిని రాష్ట్రం సస్పెండ్ చేయడం.. ఏమిటన్న చర్చ ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది. క్రిష్ణకిషోర్ తోపాటు ఎకౌంట్స్ అధికారి బి.శ్రీనివాసరావు అనే మరో ఉద్యోగిపై కూడా కేసు నమోదు చేశారు.
సీఐడీ విభాగంతోపాటు ఏసీబీ కూడా ఈ కేసును పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆయనను.. కేంద్రం మళ్లీ సర్వీసులోకి తీసుకుంటుందన్న ఉద్దేశంతోనే..హడావుడిగా కేసు నమోదు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com