రాజధానికి 30వేల ఎకరాలు కావాలని జగనే అన్నారు : నారాయణ

X
By - TV5 Telugu |19 Dec 2019 3:12 PM IST

రాష్ట్రంలోని 13 జిల్లాలకు సమదూరంలో ఉన్న అమరావతిని ఆనాడు రాజధానిగా ఎంపిక చేశామన్నారు మాజీ మంత్రి నారాయణ. ఆనాడు రాజధానికి 30వేల ఎకరాలు కావాలన్నజగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రానికైనా ఒకేరాజధాని ఉండాలని ప్రజలుకోరుకుంటారన్నారు. ఆనాడు తనకు రాజధాని ప్రాంతంలో 3129 ఎకరాలు ఉన్నాయన్నారని, ఇప్పుడేమో 55 ఎకరాల ఉందంటున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీమీద కక్షతో రాజధాని రైతులను ఇబ్బంది పెట్టొదని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

