కంటోన్మెంట్ బోర్టు ఎన్నికలకు ఏర్పాట్లు షురూ..

X
By - TV5 Telugu |19 Dec 2019 12:06 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్టు ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో మొత్తం 8 వార్డులున్నాయి. వార్డులకు సంబంధించి రిజర్వేషన్లను బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర లాటరీ ద్వారా తీశారు. ఒకటి, మూడు, నాలుగు, ఏడో వార్డుల్లో జనరల్ అభ్యర్థులు పోటీ చేసుకోవచ్చు. రెండు, ఐదు, ఆరో వార్డుల్లో మహిళా అభ్యర్థులు పోటీ చేయొచ్చు. ఒక 8వ వార్డును ఎస్సీ అభ్యర్థికి రిజర్వ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

