ఉన్నావ్‌ అత్యాచార కేసులో కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు జీవిత ఖైదు

ఉన్నావ్‌ అత్యాచార కేసులో కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు జీవిత ఖైదు
X

unnavo

దేశాన్ని కుదిపేసిన ఉన్నావ్ హత్యాచార కేసులో.. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో దోషిగా తేలిన.. బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అంతేకాదు, బాధితురాలికి 25 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. ఇందులో, పరిహారం కింద 10 లక్షలు.. కోర్టు ఖర్చులకోసం మరో 15 లక్షలు చెల్లించాలని సూచించింది.

మరోవైపు, బాధితురాలి కుటుంబానికి సెంగార్ నుంచి ఏదైనా ముప్పు ఉందేమో ఎంక్వయిరీ చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసిది. అంతేకాదు, బాధిత కుటుంబానికి సురక్షిత నివాసం కల్పించే బాధ్యతను కూడా సీబీఐకే అప్పగించింది తీస్ హజారీ న్యాయస్థానం.

వాయిస్ : యూపీలోని బంగెర్‌ మౌ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుల్దీప్ సెంగార్.. 2017లో ఉన్నావ్ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని వచ్చిన మైనర్ బాలిక ను కిడ్నాప్ చేసి మరీ పశుత్వం ప్రదర్శించాడు. తన సోదరుడు అతుల్, కొందరు అనుచరులు కూడా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో సెంగార్‌పై కిడ్నాప్, సామూహిక అత్యాచారం కేసు నమోదైంది. అతనికి సహకరించిన శశిసింగ్‌పై పోక్సోతో పాటు.. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఓవైపు కేసు కోర్టులో వుండగానే.. మరోవైపు బాధితురాలి తండ్రిపై సెంగార్ సోదరుడు హత్యాప్రయత్నం చేశాడు. అంతేకాదు, పోలీసులు అతనిపై అక్రమాయుధాల కేసు నమోదు చేశారు. ఇదంతా సెంగార్ రాజకీయ పలుకుబడితోనే జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో.. బాధితురాలు పట్టువిడువకుండా పోరాడింది. తనకు న్యాయం జరగదని భావించి.. ఓ దశలో సీఎం ఆదిత్యనాథ్ ఇంటిముందుకు ధర్నాకు దిగింది. అయితే ఈ కేసు విచారణలో వుండగానే బాధితురాలి తండ్రి మరణించారు.

ఇక, గత జూలైలో బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారును గుర్తుతెలియని ట్రక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితురాలి బంధువులు ఇద్దరు మరణించారు. ఆమెతో పాటు ఆమె తరపు న్యాయవాదికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ కూడా సెంగారే చేయించాడనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బాధితురాలికి ఢిల్లీ మహిళా కమిషన్ ఆశ్రయమిచ్చింది. సుప్రీం ఆదేశాలతో ఆమె కుటుంబానికి సీఆర్పీఎఫ్‌ బలగాలతో రక్షణ కల్పించింది. ఇటు పరిస్థితిని సమీక్షించిన సుప్రీంకోర్టు కేసును లక్నో బెంచ్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.

ఇదిలావుంటే, ఇటీవల దుండగులు బాధితులరాలిని సజీవంగా తగులబెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో బాధితురాలు 90 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇటీవలే కుల్దీప్ సెంగార్‌ ను దోషిగా తేల్చిన తీస్ హజరే కోర్టు.. ఇప్పుడు తాజాగా సెంగార్ కు జీవిత ఖైదీ విధిస్తూ శిక్షను ఖరారు చేసింది. ఇక ఈ కేసులో మరో నిందితుడు శశిసింగ్‌ ఇప్పటికే నిర్దోషిగా విడుదలయ్యాడు.

Tags

Next Story