విశాఖ అభివృద్ధి పనులకు భారీగా నిధుల కేటాయింపు

విశాఖ అభివృద్ధి పనులకు భారీగా నిధుల కేటాయింపు

jagan

ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖను ప్రకటించబోతున్న నేపథ్యంలో నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రూ.394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనుల కోసం పాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాపులుప్పాడలో బయో మైనింగ్‌ ప్రాసెస్‌ ప్లాంట్‌ కోసం రూ.22.50 కోట్లు.. కైలాసగిరి ప్లానిటోరియం కోసం రూ.37 కోట్లు.. సిరిపురం జంక్షన్‌లో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌, వాణిజ్య సముదాయం కోసం రూ.80 కోట్లు.. నేచురల్ హిస్టరీ పార్క్‌, మ్యూజియం రీసెర్చ్‌ కోసం రూ.88 కోట్లను కేటాయించింది. ఇక చుక్కవానిపాలెంలో రహదారి నిర్మాణం రూ.90 కోట్లు.. సమీకృత మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్‌ నిర్మాణం, బీచ్‌ రోడ్డులో భూగర్భ పార్కింగ్‌ కోసం రూ.40 కోట్లు.. ఐటీ సెజ్‌ నుంచి బీచ్‌ రోడ్‌ నిర్మాణం కోసం రూ.75 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.

Tags

Read MoreRead Less
Next Story