ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని బుగ్గన నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : బుద్దా వెంకన్న

X
By - TV5 Telugu |26 Dec 2019 12:32 PM IST
ముఖ్యమంత్రి జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. రాజధాని పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసులను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుందని చెబుతున్న మంత్రి బుగ్గనకు.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. బుగ్గన ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు బుద్దా వెంకన్న.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com