అమరావతి రైతులకు మద్దతుగా బెజవాడ వాకర్స్ ర్యాలీ

X
By - TV5 Telugu |27 Dec 2019 12:27 PM IST
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దీక్షలు చేస్తోన్నఅమరావతి రైతులకు మద్దతుగా విజయవాడలో బెజవాడ వాకర్స్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి అభివృద్ధికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెయిడ్ ఆర్టిస్టులని వెటకారంగా మాట్లాడడం బాధకరమని వాపోయారు. కేవలం రాజకీయకక్షతో ఐదేళ్ల చిన్నారి అమరావతిని ప్రభుత్వం గొంతు నులిమి చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోన్న బెజవాడ వాకర్స్ అంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com