టీడీపీ హయాంలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించారా? : మంత్రి బొత్స

విశాఖపట్నంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలు ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడినట్లు ఆధారాలు చూపిస్తే విచారణ జరిపించడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. టీడీపీ హయాంలో వచ్చిన ఆరోపణలపై ఏనాడైనా విచారణ జరిపించారా అని ప్రశ్నించారు. బాలకృష్ణ వియ్యంకుడికి రాజధాని ప్రాంతంలో 498 ఎకరాలు కట్టబెట్టి.. ఆ తర్వాత CRDA పరిధిలో చేర్చడం... టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలకు నిదర్శనమని బొత్స ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
