రాజధాని వ్యవహారం రాష్ట్ర పరిధిలోని అంశం : బీజేపీ ఎంపీ జీవీఎల్

X

రాజధాని వ్యవహారం రాష్ట్ర పరిధిలోని అంశమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.. నిన్న ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు.. సుజనా చౌదరి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు.. అయితే, తాను కేంద్రంతో చర్చించే మాట్లాడానని సుజనా చౌదరి చెప్పగా.. తాను బీజేపీ అధికార ప్రతినిధిగా ఈ అంశంపై మాట్లాడుతున్నానని జీవీఎల్ అన్నారు.. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజధాని అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు జీవీఎల్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
