ఇండియన్ నేవీ అలర్ట్.. సిబ్బందిపై ఆంక్షలు
![ఇండియన్ నేవీ అలర్ట్.. సిబ్బందిపై ఆంక్షలు ఇండియన్ నేవీ అలర్ట్.. సిబ్బందిపై ఆంక్షలు](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2019/12/navy-1.png)
శత్రుదేశాలకు కీలక సమాచారాన్ని అందిస్తోన్న ఏడుగురు నేవీ సిబ్బంది అరెస్ట్తో భారతనౌకదళం అప్రమత్తమైంది. ఆన్లైన్లో ముప్పు పొంచి ఉండటంతో.. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్లు, నెట్వర్కింగ్, బ్లాగింగ్, ఇ-కామర్స్ వంటి వెబ్సైట్లు తమ సిబ్బంది ఉపయోగించకుండా నిషేధించింది. నేవీ బేస్లు, డాక్యార్డ్లు, యుద్ధ నౌకల్లో స్మార్ట్ఫోన్లు కూడా వినియోగించరాదని ఆదేశించింది. సిబ్బంది హనీట్రాప్లో పడకుండా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది నౌకాదళం.
పాకిస్థాన్కు కీలక సమాచారాన్ని చేరవేస్తున్న ఏడుగురు నేవి అధికారుల్ని విశాఖలో అరెస్ట్ చేశారు. ఈ స్పై రాకెట్ను ఏపీ ఇంటెలిజెన్స్ సెల్ ఇటీవల బయటపెట్టింది. కేంద్ర, నౌకాదళ నిఘా విభాగాల సహకారంతో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ పేరుతో ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది. హవాలా డబ్బు కోసం.. దేశ రహస్యాలను పాకిస్థాన్కు చేరవేస్తున్నారు ఏడుగురు నేవీ ఉద్యోగులు. వీరితో పాటు ఓ హవాలా ఆపరేటర్ను అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన నేవీ.. సోషల్మీడియా, స్మార్ట్ఫోన్లను నిషేధించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com