ముఖ్యమంత్రి జగన్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే
By - TV5 Telugu |30 Dec 2019 12:49 PM GMT
ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.. ముఖ్యమంత్రి జగన్ను టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి కలవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.. మంత్రి వెల్లంపల్లితో కలిసి సీఎం జగన్ను కలిశారు మద్దాలి గిరి.. గతంలోనూ ఇదే విధంగా సీఎంను కలిశారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఈ నేపథ్యంలో మద్దాల గిరి కూడా వంశీ బాటలోనే వెళ్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. వైసీపీకి మద్దతు పలుకుతానని మద్దాలి గిరి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com