CAAకు మద్దతుగా ప్రవాస భారతీయులు భారీ ర్యాలీ

X
By - TV5 Telugu |31 Dec 2019 4:50 PM IST
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా అమెరికాలో ప్రవాస భారతీయులు భారీ ర్యాలీ నిర్వహించారు. న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ సెంటర్ లో వందలాదిమంది ప్లేకార్డ్స్ పట్టుకొని ర్యాలీలో చేపట్టారు. బే ఏరియాలోని కాలిఫోర్నియాలో సైతం ఎన్నారైలు CAA కు మద్దతు తెలిపారు. CAA, NRC ల చుట్టూ అలుముకున్న తప్పుడు అపోహలను తొలగిద్దామంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో అఫ్ బీజేపీ అమెరికా ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఏనుగుల, యూత్ కో కన్వీనర్ విలాస్ రెడ్డి,సత్యనారాయణతోపాటు చికాగో, కాలిఫోర్నియా,న్యూయార్క్ నుంచి వచ్చిన వందలాదిమంది ఎన్నారైలు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా న్యూయార్క్ టైం స్వైర్ సెంటర్ లో భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com