న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. గోవాలో ముగ్గురు తెలుగువారు మృతి

న్యూ ఇయర్ సంబరం కాస్త విషాదం మారింది. గోవాలో జరిగిన సన్బర్న్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్-EDM ఫెస్టివల్లో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. టికెట్ల కోసం క్యూలో నిల్చుని.. అలాగే కుప్పకూలిపోయాడు. అతడిని హైదరాబాద్కు చెందిన కోట ఫణిదీప్గా గుర్తించారు. దీంతో.. సన్బర్న్ EDM ఫెస్టివల్ ముగ్గురు తెలుగువాళ్లను బలి తీసుకున్నట్టు అయింది.
ఇదే వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన హైదరాబాదీ సాయిప్రసాద్, విశాఖ పెందుర్తికి చెందిన చిన్ని వెంకట్ కూడా తొక్కిసలాటలో మృతి చెందారు. వాళ్ల మరణాలపైనా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. స్టేడియానికి పెద్దసంఖ్యలో వీక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగిందని.. బారికేడ్లు మీద పడటంతో.. పక్కటెముకలు విరిగి.. అంతర్గత రక్తస్రావం కారణంగా వెంకట్ మరణించినట్టు అతని బంధువులు చెప్తున్నారు. ఆ విషాదం మరిచిపోకముందే మరో యువకుడు ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. బెంగళూరులో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఫణిదీప్.. స్నేహితులతో కలిసి వెగటూర్ బీచ్లో నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్లాడు. డ్రగ్స్ తీసుకున్నాడా.. ఓవర్డోస్ అయిందా.. తలకు బలమైన గాయం కావడంతో మరణించాడా.. అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
RELATED STORIES
Vinod Kambli: కష్టాల్లో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి.. సాయం కోసం...
18 Aug 2022 3:00 PM GMTYuzvendra Chahal: విడాకులు తీసుకోనున్న క్రికెట్ కపుల్..? సోషల్...
18 Aug 2022 2:45 PM GMTDhanashree Verma: 'రారా రెడ్డి' పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ భార్య.....
10 Aug 2022 4:05 AM GMTAsia Cup 2022: యూఏఈలో ఆసియా కప్.. డిఫెండింగ్ ఛాంపియన్గా టీమిండియా..
3 Aug 2022 10:15 AM GMTAsia Cup 2022: క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..! ఆసియా కప్ 2022...
2 Aug 2022 3:45 PM GMTMithali Raj: 'అలా జరిగితే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తా'.. మిథాలీ ప్రకటన
26 July 2022 1:50 AM GMT