ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లైన్ను... యూపీ నుంచి ఎన్నికైన ఎంపీ నిర్ణయించడమా? : రతన్ శార్దా

X

ఏపీ రాజధాని విషయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు వ్యాఖ్యలపై... సొంత వర్గం నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదంటూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై.. RSS ప్రధాన కార్యదర్శి రతన్ శార్దా ఆభ్యంతరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ లైన్ను... యూపీ నుంచి ఎన్నికైన ఎంపీ నిర్ణయించడమేంటని ప్రశ్నించారు. మత మార్పిడులను ప్రేరేపించే శక్తులు ఉన్న రాష్ట్రంలో హిందువులు స్వధర్మం కోసం సంఘర్షణ చేయాలని భావిస్తున్నారా అని నిలదీశారు.? అలాంటి పోరాటం చేసే శక్తి హిందువుల్లో ఉందంటూ ఉద్వేగంగా ట్వీట్ చేశారు...రతన్ శార్దా.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
