చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు : మంత్రి బొత్స

X
By - TV5 Telugu |2 Jan 2020 3:24 PM IST
ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు టీడీపీ అనుకూలంగా వ్యవహరించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఒక టౌన్ షిప్ కడితే సంపద రాదన్నారు. అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెరిగినంత మాత్రాన.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయా అని ప్రశ్నించారు. భువనేశ్వరి రైతుల దగ్గరికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించిన బొత్స.. గాజులు కాకుండా తీసుకున్న భూములు తిరిగివ్వాలని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com