పౌరసత్వ సవరణ చట్టం CAAపై విపక్షాలకు నాలెడ్జ్ లేదు : రాంమాధవ్

By - TV5 Telugu |3 Jan 2020 9:39 AM GMT
పౌరసత్వ సవరణ చట్టం CAAపై విపక్షాలకు నాలెడ్జ్ లేదన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. భావోద్వేగాల ఆధారంగా కాకుండా... CAAపై వాస్తవాలను అర్థం చేసుకోవాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ABVP నిర్వహించిన CAA మద్దుతు సభలో పాల్గొన్న రాంమాధవ్... ఈ చట్టంతో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. దేశలోని అందరికీ సమాన ప్రాతినిధ్యం, సమాన హక్కులు ఉంటాయన్నారు రాంమాధవ్. CAAకు వ్యతిరేక ప్రదర్శనలు హింసాత్మకంగా మారటం బాధాకరమన్నారు రాంమాధవ్.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com