జాతీయ మానవహక్కుల కమిషన్ను కలిసిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర

By - TV5 Telugu |3 Jan 2020 2:47 PM GMT
రాజధాని ప్రాంతంలో మహిళలపై పోలీసు జులుం ప్రదర్శించడాన్ని టీడీపీ సీరియస్ తీసుకుంది. జాతీయ మానవహక్కుల కమిషన్ను కలిసిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా రైతులు చేస్తున్న ఆందోదళనలపై పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలపై, రైతులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. మహిళలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మనవహక్కుల కమిషన్ను ఆయన కోరారు. రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వలు బాగుపడ్డట్టు చరిత్రలో లేదన్నారు కనకమేడల.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com