అమరావతిలో అరెస్టుల పర్వం

X
By - TV5 Telugu |3 Jan 2020 2:30 PM IST
అమరావతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్పై బైఠాయించి మహిళలు ధర్నా దిగారు. దీంతో మహిళలను అరెస్ట్ చేశారు. బస్సుల్లో పోలీసులు తమపై దాడి చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
అటు తుళ్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. సచివాలయంకు వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చేసుకుంది. రోడ్పై బైఠాయించి నిరసన తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com