వైసీపీ నిరంకుశ పాలనకు అది పరాకాష్ట : చంద్రబాబు

టీడీపీ నేతలను పోలీసులు నిర్బంధించడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ను కూడా అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రాజధాని కోసం వేలాది కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాయన్న చంద్రబాబు. రైతులు, రైతు కూలీలకు మద్దతు తెలిపేందుకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు.. వందలాది మంది టీడీపీ నేతల అక్రమ నిర్బంధం వైసీపీ నిరంకుశ పాలనకు పరాకాష్ట అన్నారు. రైతులు, మహిళలు, రైతు కూలీలపై అక్రమ కేసులు పెట్టడం గర్హనీయమన్నారు. పోలీసు బలగాలతో ప్రజాభీష్టాన్ని కాలరాయలేరన్నారు చంద్రబాబు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
RELATED STORIES
MS Dhoni: మిస్టర్ కూల్ కొత్త అవతారం.. గురూజీగా మహేంద్ర సింగ్ ధోనీ..
11 Aug 2022 11:43 AM GMTGold and Silver Rates Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు.. స్వల్ప...
11 Aug 2022 12:55 AM GMTGold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
10 Aug 2022 12:50 AM GMTRakshabandhan: ఆ రాఖీ ఖరీదు అక్షరాలా అయిదులక్షలు..
9 Aug 2022 9:03 AM GMTChina Mobiles Ban : త్వరలో చైనా మొబైల్స్ బ్యాన్.. కారణం అదే...
9 Aug 2022 3:30 AM GMTGold and Silver Rates Today: స్థిరంగా బంగారం వెండి ధరలు..
9 Aug 2022 1:05 AM GMT