అనారోగ్యంతో కన్నుమూసిన ఒమన్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్ అల్ సైద్

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒమన్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్ అల్ సైద్ కన్నుమూశారు. శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు దివాన్ ఆఫ్ రాయల్ కోర్టు తెలిపింది. సుల్తాన్ మరణం పట్ల సంతాపం తెలుపుతూ దివాన్ ఆఫ్ రాయల్ కోర్టు ఓ ప్రటకన విడుదల చేసింది. అరబ్, ఇస్లామిక్ దేశాల అభిమానం పొందిన సుల్తాన్ మృతి తీరని విషాదాన్ని మిగిల్చిందని విచారణ వ్యక్తం చేసింది. సుల్తాన్ మృతికి సంతాపంగా దివాన్ ఆఫ్ రాయల్ కోర్టు మూడు రోజులను సంతాప దినాలుగా ప్రకటించింది. అలాగే సంతాప సూచకంగా నలభై రోజుల పాటు జాతీయ జెండాను సగం వరకు కిందకు దించారు.
సుల్తాన్ కబూస్ 1940లో సలాహ్ లో జన్మించారు. ఐదు దశాబ్దాల పాటు మకుటం లేని మహారాజుగా ప్రజల మన్నలు అందుకున్నారు. గల్ఫ్ కంట్రీస్ తో సత్సంబంధాలు కొనసాగిస్తూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇదిలాఉంటే..సుల్తాన్ తన తరువాతి వారసుడి పేరును ఓ సీల్డ్ కవర్లో దాచిపెట్టారు. తాను చనిపోయిన తర్వాత కవర్ ఓపెన్ చేయాలని కండీషన్ విధించారు. దీంతో రూలర్ సుల్తాన్ కబూస్ స్థానంలో అతని వారసుడిగా ఎవరు రాబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com