- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు...
తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

By - TV5 Telugu |15 Jan 2020 12:23 PM GMT
పండగ వేళ తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రావులపాలెం 16వ నెంబర్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
రావులపాలెం వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు.. తణుకు నుండి వస్తున్న మరొక కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైవే అంబులెన్స్లో కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com