మా సత్తా ఏంటో స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో చూపిస్తాం - నాదెండ్ల

X
By - TV5 Telugu |18 Jan 2020 5:49 PM IST
బీజేపీ, జనసేన కలయిక రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. జగన్ నిర్ణయాలన్నీ ఒంటెద్దు పోకడలతో ఉన్నాయని తిరుపతి పర్యటనకు వచ్చిన నాదెండ్ల అన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన చోటే రాజధాని ఉండాలన్నారు. ఏపీ అభివృద్ధికి నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. తమ సత్తా ఏంటో స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో చూపిస్తామన్నారు. అధికార పార్టీ నేతల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు నాదెండ్ల.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com