బిల్డింగ్ ఎక్కిన రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

X
By - TV5 Telugu |19 Jan 2020 4:05 PM IST
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్వార్టర్స్ బిల్డింగ్ ఎక్కిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటలకు పైగా రైతులు భవనంపై నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని... వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే వరకు దీక్ష విరమించబోమని చెప్పారు.. కొద్ది సేపటి తర్వాత పోలీసులు ముందుకెళ్లి... రైతులను రాజధాని విషయంలో ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com