ఒకే రాజధాని ఒకే అసెంబ్లీకి కట్టుబడి ఉన్నాం : టీడీఎల్పీ

X
By - TV5 Telugu |19 Jan 2020 7:44 PM IST
రాష్ట్రంలో విభజన నాటి పరిస్థితులు నెలకొన్నాయని... ప్రాంతీయ విబేధాలను జగన్ రెచ్చగొట్టారని.. టీడీఎల్పీ అభిప్రాయ పడింది. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో రాజధాని తరలింపు సరికాదన్నదే తెలుగుదేశం విధానమని... టీడీఎల్పీ ఉపనేత రామానాయుడు తెలిపారు. ఒకే రాజధాని ఒకే అసెంబ్లీకి తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. రేపు అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తామని... బిల్లును ఏ రూపంలో తీసుకొచ్చినా వ్యతిరేకించి తీరుతామని రామానాయుడు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com