రాజధానిపై స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం.. దానికి కట్టుబడి ఉన్నాం: నాగబాబు

X
By -  TV5 Telugu |21 Jan 2020 4:09 AM IST

అమరావతి గ్రామాల్లో పవన్ పర్యటించకుండా పోలీసులు అడ్డుకోవడం తప్పు అన్నారు జనసేన పార్టీ నాయకులు నాగబాబు. మహిళా రైతులపై దాడిని ఖండించారాయన. అరెస్టయిన రైతులు, మహిళల్ని పరామర్శించే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. రాజధానిపై స్థిరమైన నిర్ణయం తీసుకున్నామని.. దానికి కట్టుబడి ఉన్నామని నాగబాబు తెలిపారు. పవన్ కచ్చితంగా అమరావతి గ్రామాల్లో పర్యటిస్తారని స్పష్టంచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

