కళ్లకు గంతలు కట్టుకుని జేఏసీ నాయకుల నిరసన

X
By - TV5 Telugu |22 Jan 2020 2:44 AM IST
ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడంపై చిత్తూరు జిల్లాలో టీడీపీ నిరసన తెలిపింది. మిగతా పార్టీలు సైతం రోడ్డెక్కాయి. చిత్తూరు పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద జేఏసీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని, మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయకుంటే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జేఏసీ హెచ్చరించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

