నిత్యానందపై బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసిన ఇంటర్ పోల్

నిత్యానందపై బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసిన ఇంటర్ పోల్

వివాదాస్పద స్వామి నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీస్ జారీ అయ్యింది. నిత్యానంద ఆచూకీ చెప్పాలని ప్రపంచ దేశాలను ఇంటర్ పోల్ కోరింది. నిత్యానంద ఆచూకీ తెలుసుకోవడానికి సహకరించాలంటూ గుజరాత్ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. స్పందించిన ఇంటర్‌పోల్, నిత్యానందపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది.

అమ్మాయిలను లైంగికంగా వేధించాడని నిత్యానందపై ఆరోపణలున్నాయి. గుజరాత్‌లోని ఆశ్రమంలో బాలికలను అక్రమంగా నిర్బంధించారని అభియోగాలు నమోదయ్యాయి. కేసుల నేపథ్యంలో నిత్యానంద దేశం నుంచి పరారయ్యాడు. గత ఏడాది ఓ రహస్య ప్రాంతం నుంచి నిత్యానంద మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం ఈక్వెడార్ సమీపంలో తాను ఒక దీవిని కొనుగోలు చేశానని.. దానికి కైలాసం అని పేరు పెట్టానని నిత్యానంద చెప్పుకొచ్చాడు. ఆ వార్తలను ఈక్వెడార్ కొట్టిపారేసింది. నిత్యానంద తమ దేశంలో లేడని, హైతీ వెళ్లి ఉండొచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిత్యానంద కోసం గుజరాత్ పోలీ సులు తీవ్రంగా వెతుకుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story